PM Kisan 20th Installment Update: ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా లక్షలాది రైతులు ప్రయోజనాలను పొందుతున్నారు. ఈ యోజన కింద ప్రతి సంవత్సరం రైతుల ఖాతాల్లో రూ.6,000 నేరుగా జమ అవుతుంది. ఇప్పటి వరకు 19 వ విడత జారీ అయ్యింది. ఈ విడతను 2025 ఫిబ్రవరి 24న విడుదల చేశారు. అయితే కొంతమంది రైతులకు మాత్రం ఈ సారి రూ.2000 చెల్లింపు అందలేదు. ఇప్పుడు 20వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు, కానీ అందరికీ ఈ మొత్తాలు లభించవు. దీని వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.

ఇ-కెవైసీ పూర్తి చేయలేదు
ఇ-కెవైసీ తప్పనిసరిగా ఉండటంతో, ఇది పూర్తిగా లేకపోతే లేదా తప్పుగా ఉన్నట్లయితే రైతుల ఖాతాలోకి డబ్బు రాదు. రైతులు ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి, లేకపోతే వారి హక్కు డబ్బు నిలిపివేయబడుతుంది.
ఆధార్ లింకింగ్ లోపం
మీ బ్యాంక్ ఖాతా ఆధార్ కార్డ్తో లింక్ కాలేదంటే, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఇది చాలా సాధారణమైన సమస్యగా మారింది. వ్యవసాయశాఖ ఈ విషయాన్ని పలు మార్లు హైలైట్ చేసింది.
పాత వివరాలు అప్డేట్ చేయలేదు
మీ బ్యాంక్ లేదా ఆధార్ వివరాలు పాతదైతే, విడత డబ్బు జమ కాకపోవచ్చు. సమాచారం తాజా ఉండేలా చూడటం ఎంతో అవసరం.
విడత స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
వెబ్సైట్ pmkisan.gov.in వెళ్లు
→ “Know Your Status” క్లిక్ చేయండి
→ మీ రిజిస్ట్రేషన్ ID నమోదు చేసి OTP తీసుకుని ఎంటర్ చేయండి
→ అప్పుడు మీ విడత స్టేటస్ కనిపిస్తుంది
డీబీటీ సదుపాయం నిలిపివేత
బ్యాంక్ ఖాతాలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) యాక్టివ్గా లేకపోతే, చెల్లింపు జరగదు. రైతులు తమ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించి DBT సదుపాయం చురుకుగా ఉందో లేదో నిర్ధారించుకోవాలి.
Advertisement
